Wednesday, May 1, 2024

TS | పెళ్లి కావటం లేదని యువకుడి ఆత్మహత్య..

బోథ్, ప్రభ న్యూస్ : పెళ్లి కావడం లేదని యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని కొత్తగల్లికి చెందిన జాదవ్ జ్ఞానేశ్వర్ (21)కు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

అనేక సంబంధాలు చూసినప్పటికీ ఏ ఒక్కటి కూడా సెట్ కాలేదు. కొత్త పంచాంగం ఉగాది పండుగ తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో రెండు మూడు రోజులుగా నిర్లప్తంగా ఉన్నాడు. పెళ్లి అవుతలేదనే మనస్తాపంతో శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి జాదవ్ సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement