Sunday, April 28, 2024

MBNR | రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయం.. ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే

మక్తల్, (ప్రభన్యూస్): గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గాయపడి రోడ్డు మీద పడి ఉన్న మహిళ ను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం రాత్రి జడ్చర్ల ఫ్లైఓవర్  వద్ద జరిగింది. గిరిజన మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమె రోడ్డుపై పడి ఉంది.

108 కు ఫోన్ చేసి 15 నిమిషాలు దాటినా అబ్బులెన్స్​ రాకపోవడంతో అదేసమయంలో హైదరాబాదు నుండి మక్తల్ వెళ్తున్నా ఎమ్మెల్యే శ్రీహరి సంఘటన స్థలాన్ని గుర్తించి బాదిత మహిళలను స్వయంగా తన వాహనంలో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement