Sunday, April 28, 2024

MBNR: స్కూలుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

మక్తల్, ఏప్రిల్4 (ప్రభ న్యూస్) : రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందిన దుర్ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలంలో చోటుచేసుకుంది. కృష్ణ మండలంలోని ఆనంపల్లి గ్రామానికి చెందిన కావలి ప్రకాష్ అనే 9వ తరగతి విద్యార్థి ప్రతిరోజూ మాదిరిగానే ఇవాళ మిత్రులతో కలిసి సైకిల్ పై స్వగ్రామం ఆనంపల్లి నుండి కున్సి గ్రామానికి వెళుతుండగా కున్సి గ్రామ స్టేజీ సమీపంలో పత్తిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ త‌గిలి, ట్రాలీ కింద పడ‌డంతో తలచిద్రమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

అతడితో పాటు వెనకాలే సైకిళ్లపై వస్తున్న మరో నలుగురు విద్యార్థులు విషయాన్ని కున్సి గ్రామస్తులకు తెలియజేశారు. ఈ సంఘటనతో కున్సి పాఠశాలతో పాటు విద్యార్థి స్వగ్రామం ఆనంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతిచెందిన విద్యార్థి వంశీ గ్రామంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement