Friday, May 3, 2024

bachupally : నారాయణ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి కింద పడి విద్యార్థిని మృతి

మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత (16) అనే విద్యార్థినిని వారం క్రితం నారాయణ కలశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసిలో జాయిన్ చేశారు తల్లిదండ్రులు. దీంతో ఇవాళ ఉదయం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో కింద పడి మృతి చెందింది. దీంతో హుటాహుటిన కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు. వంశిత బిల్డింగ్ పై నుండి దూకిందా ? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని వంశిత ది ఆత్మహత్యనా లేక హత్యనా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి వుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement