Tuesday, July 23, 2024

ఇనుప రాడ్ తో కొడుకును హతమార్చిన తండ్రి

తండ్రి చేతిలో కొడుకు హతమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కేశంపేటలో చోటుచేసుకుంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగిన వాగ్వివాదంలో కొడుకు హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తొండుపల్లి హనుమంత్ రెడ్డి (37) షాద్ నగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.

ఇంట్లో తండ్రి తోండుపల్లి గోవర్ధన్ రెడ్డి, కొడుకు హనుమంత్ రెడ్డి మధ్య వాగ్వివాదం జరగడంతో తండ్రి కుమారునిపై ఇనుపరాడుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఆంజనేయులు పోలీసులకు సమాచారం అందజేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన పరిసరాలను పరిశీలించారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై ధనుంజయ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement