Friday, May 17, 2024

Delhi: తెలంగాణ హైకోర్టులో 15 ఖాళీలు.. ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులకు 27 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారని, మరో 15 ఖాళీలున్నాయని కేంద్రం తెలిపింది. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు బదులిచ్చారు. 2021లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచినట్టు వెల్లడించారు. అయితే 2021 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు 17 మంది న్యాయమూర్తులు నియమితులైనట్టు ఆయన వెల్లడించారు. మంజూరైన మొత్తం పోస్టుల్లో ఇంకా 15 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని వెల్లడించారు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement