Sunday, April 28, 2024

ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా..

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కూడా కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్షలు చేయించుకున్న ఆమెకు పాజిటివ్ అని వెల్లడైంది. ఈ విషయాన్ని సురభి వాణీదేవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని, ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. వాణీదేవి ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈవిషయాన్ని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనతో ఇటీవల కాంటాక్ట్ అయినవారు ఐసోలేషన్లో ఉండాలని అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement