Friday, April 19, 2024

KTR: షర్మిల పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించొచ్చు

తెలంగాణలో రాజన్నరాజ్యమే లక్ష్యమంటూ వైయస్సార్టీపీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల…ముందుకు సాగుతున్నారు. పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిన ఆమె రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ప్రజలను నేరుగా కలుస్తూ వారితో మమేకమవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే, తాజాగా షర్మిల పార్టీపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి మీకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానంగా… రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని, వైఎస్ షర్మిల పార్టీ వైయస్సార్టీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించొచ్చని అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement