Saturday, May 18, 2024

వైఎస్ షర్మిలకు పాజిటివ్ ?!

తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్‌ షర్మిల అనుచరులకు కరోనా కలవరం పెడుతోంది. షర్మిల ప్రధాన అనుచరుడు బాలకృష్ణ రెడ్డి కరోనాతో మృతి చెందడం కలకలం రేపుతోంది. అంతేకాదు షర్మిలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో లోట్‌ సపాండ్‌ కార్యాలయం వద్ద షర్మిల దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం దీక్ష విరమణ అనంతరం.. షర్మిల మద్దతుదారులు కొందరు కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డితోపాటు మరో ఇద్దరికి పాజిటివ్‌ గా తేలింది. దీంతో ఈ దీక్షలో యాక్టివ్‌ గా ఉన్న నేతలూ కరోనా పరీక్ష బాట పట్టారు. షర్మిల సహా ముఖ్యనేతలు.. ప్రైమరీ కాంటాక్టు కావడంతో వారం పాటు లోటస్ పాండ్‌ కార్యాలయానికి సెలవు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement