Sunday, May 5, 2024

‘కేసీఆర్’ పై మండిప‌డిన ష‌ర్మిల

సీఎం కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైఎస్ఆర్ టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌. మీ హ‌డావుడి అనాలోచిత నిర్ణ‌యాల‌కు రెండు ల‌క్ష‌ల‌మంది విద్యార్థుల జీవితాలు ఆగ‌మ‌య్యేలా చేశార‌ని మండిప‌డ్డారు. మరింత మంది విద్యార్థులు మరణించక ముందే కనీసం గ్రేస్ మార్కులైన వేసి పాసయ్యే అవకాశం కల్పిస్తారో, లేక 1 st ఇయర్ ఫలితాలను రద్దు చేసి అందరినీ 2 nd ఇయర్ కు ప్రిపేర్ కావాలని చెప్తారో.. ప్రభుత్వం త్వరగా నిర్ణహించు కోవాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా చదువులు సాగింది లేదు, ఆన్ లైన్ సౌకర్యం లేక పాఠాలు అందింది లేదని మండిపడ్డారు. సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేశాక మళ్లీ ఫస్ట్ ఇయర్ పరీక్షల న్నారని… నెల రోజుల్లో పరీక్షలు పెట్టి ప్రిపరేషన్ కు టైం ఇవ్వకుండా ఫెయిల్ అయ్యేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement