Sunday, April 28, 2024

ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద వైఎస్‌ షర్మిల తన దీక్షను ప్రారంభించారు. తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ దీక్షను 72 గంటల పాటు నిర్వహించాలని భావిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజుకు మాత్రమే అనుమతి జారీ చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే షర్మిల తన దీక్షను నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఆమె ఎప్ప‌టివ‌ర‌కు దీక్ష చేస్తార‌న్న విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. కాగా నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఇటీవల నిర్వహించిన ఖమ్మం సభలో షర్మిల ప్రకటించిన విషయం విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement