Sunday, April 28, 2024

యోగాతో ఆరోగ్య‌మే కాదు అందం కూడా – గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

నిత్యం యోగా చేయ‌డం వ‌ల్ల య‌వ్వ‌నంగా ఉంటామ‌ని..అనేక శారీర‌క రుగ్మ‌త‌ల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యంగా ఉంటామ‌ని తెలిపారు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌంట్‌డౌన్‌ పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, సర్బానంద సోనోవాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, క్రికెటర్‌ మిథాలి రాజ్‌, సినీ నిర్మాత దిల్‌ రాజు, మా అధ్యక్షుడు మంచు విష్ణు పాల్గొన్నారు. ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని చెప్పారు. ఇస్లాం దేశాలు కూడా యోగాను ఆదరిస్తున్నాయన్నారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement