Monday, May 6, 2024

ట్రైన్ పైకి ఎక్కేందుకు ప్ర‌య‌త్నించిన మ‌హిళ‌–వైర‌ల్ గా వీడియో

ట్రైన్ లో సీటు దొర‌క‌లేదు ఓ మ‌హిళ‌కి. అలా అని ఆ మ‌హిళ ఊరుకోలేదు. ట్రైన్ బోగీపైకి ఎక్కేందుకు నానా తంటాలు ప‌డింది. బంగ్లాదేశ్‌లోని ఓ స్టేష‌న్‌లో ఇంట‌ర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉంది. రైలు మొత్తం జ‌నాల‌తో నిండిపోయింది. దీంతో చాలామంది బోగీపైకి ఎక్కి కూర్చున్నారు. ఓ మ‌హిళ పైకి ఎక్కేందుకు ప్ర‌య‌త్నించినా విఫ‌లమైంది. నానా తంటాలు పడింది. చివ‌ర‌కు రైల్వే పోలీసులు వ‌చ్చి ఆమెను వారించ‌డంతో అక్క‌డినుంచి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ దృశ్యాలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. ఇలా బోగీపై ప్ర‌యాణించ‌డం క్రిమిన‌ల్ నేరం కాదా అని నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. కాగా బంగ్లాదేశ్ రైళ్ల‌లో ఎప్పుడు చూసినా జ‌నం ర‌ద్దీ క‌నిపిస్తుంటుంది. రైలు బోగీల్లోకి ఎక్కేందుకు ఒక‌రినొక‌రు తోసుకోవ‌డం, కొట్లాడుకునే వీడియోలు సోష‌ల్‌మీడియాలో ఇటీవ‌ల తెగ వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ అతి ప్ర‌మాద‌క‌రంగా వెళ్తుంటే, మ‌రికొందరు రైలు బోగీపైన ఎక్కి ప్ర‌యాణిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement