Sunday, April 28, 2024

Crime: మ‌హిళ‌కు మ‌ద్యం తాగించి గ్యాంగ్ రేప్!

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన మానవ మృగాల్లో మార్పు మాత్రం రావడం లేదు. ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై లైంగిక దాడుల ఘ‌ట‌నలు జరుగుతున్నాయి. తాజాగా కాన్పూర్‌లోని చ‌కెరిలాల్ బంగ్లా ప్రాంతంలో మ‌హిళపై ముగ్గురు వ్య‌క్తులు లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. మ‌హిళ‌కు బ‌లవంతంగా మ‌ద్యం తాగించి ఆపై ఈ దారుణానికి ఒడిగట్టారు. లైంగిక దాడిని ప్ర‌తిఘ‌టించిన మ‌హిళ‌ను వారు తీవ్రంగా హింసించారు. మ‌హిళ అరుపులు విన్న స్ధానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement