Monday, April 29, 2024

Flash: ప్రజ్ఞాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ప్రజ్ఞాపూర్‌ లోని కరీంనగర్‌ – హైదరాబాద్‌ రాజీవ్‌ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు.  గౌరారం వైపు నుండి ప్రజ్ఞాపుర్ వెళ్తున్న కారు అదుపుతప్పి అవతలి రోడ్డుపై వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గజ్వేల్‌ పట్టణానికి చెందిన శ్రీధర్‌, జలజగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement