Saturday, May 4, 2024

Ponguleti : కేసీఆర్ ను తరిమికొట్టేందుకే అందరం ఏకమవుతున్నాం..

తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ను తరిమికొట్టేందుకే అందరం ఏకమవుతున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి జూపల్లి, పొంగులేటిలతో భేటీ అయ్యారు. వారిని రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జూపల్లితో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ… మూడు నాలుగు రోజుల్లో పార్టీలో చేరికపై ఓ ప్రకటన చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలిపారు.

ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకున్నాం… పార్టీ వివరాలు, చేరికలపై మూడు నాలుగు రోజుల్లో మా నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి.. కాంగ్రెస్ నాయకులు మా ఇంటికి వచ్చారన్నారు. తాము బీఆర్ఎస్ నుండి ఎందుకు బయటకి వచ్చామో అనేక వేదికలపై చెప్పామన్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని తెలంగాణ బిడ్డలు ఆశించారు.. కానీ తెలంగాణ ప్రజల కలలు కలలుగానే మిగిలాయన్నారు. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని చెప్పాం.. 24న లేదా 25న తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. నెక్ట్స్ మంత్ ఫస్ట్ వీక్ లో జాయినింగ్ ఉంటుందన్నారు. ఢిల్లీలోనో, హైద్రాబాద్ లోనో జాయిన్ అవ్వనని, ఖమ్మం నడిబొడ్డులో పార్టీలో చేరుతానన్నారు. మూడు అసెంబ్లీ స్థానాలు అనుకుంటున్నాను. అందులో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీచేస్తానని పొంగులేటి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement