Wednesday, April 24, 2024

Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై విరాట్‌ కోహ్లి దిగ్బ్రాంతి

ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 290మందికి పైగా మృత్యువాత పడగా.. 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ పెను ప్రమాదంపై భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ఇంత మంది మరణించడం తన మనసును కలిచి వేసిందని విరాట్‌ ట్వీట్‌ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement