Sunday, March 24, 2024

Shankarpally : రైతు బాంధవుడు కేసీఆర్.. ఎమ్మెల్యే కాలే యాదయ్య

రైతు దినోత్సవం సందర్భంగా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం.. పర్వేద గ్రామాలలో రైతు దినోత్సవం వేడుకలలో పాల్గొన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 65 వేల కోట్ల రూపాయలను రైతుబంధు ద్వారా రైతులకు అందజేసిన గొప్ప మనిషి రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. తెలంగాణలో రైతు ప్రభుత్వం ..రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం ఉంద‌ని ఆయన నొక్కి వక్కాణించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement