Monday, April 29, 2024

నేడు మేడారంలో మొక్కలు తీర్చుకోనున్న ప్రముఖులు

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. వనదేవత సమ్మక్కను నిన్న మేడారం తీసుకువచ్చారు. చిలుకలగుట్ట వద్ద భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య కోలాహలం నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారింది.

ఈ రోజులు మేడారంలో ప్రముఖులు పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులు రేణుకాసింగ్, జి.కిషన్‌రెడ్డి శుక్రవారం వేర్వేరుగా మేడారం చేరుకుని వన దేవతలను దర్శించుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా వస్తారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement