Tuesday, May 21, 2024

మ‌ణిపూర్ లో మ‌ళ్లీ హింస‌.. మంత్రి ఇంటికి నిప్పు

మ‌ణిపూర్ లో హింస‌కు తెర‌ప‌డ‌లేదు..ఆ రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళా మంత్రి నెమ్చా కిప్గెన్ ఇంటికి దుండ‌గులు నిప్పు పెట్టారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లా లాంఫెల్ ప్రాంతంలో పరిశ్రమల మంత్రి నెమ్చా కిప్గెన్ బంగళాను లక్ష్యంగా చేసుకున్న దుండగులు నిన్న సాయంత్రం నిప్పు పెట్టారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ అధికారుల నేతృత్వంలోని భద్రతా బలగాలు మంత్రి ఇంటికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యమత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వంలోని 12 మంది మంత్రుల్లో కిప్గెన్ ఏకైక మహిళా మంత్రి. ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్న 10 మంది కుకీ ఎమ్మెల్యేలలో కిప్గెన్ ఒకరు. కాగా గత 24 గంటల్లో కాల్పుల ఘటనలో 9మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు ఆర్మీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement