Monday, April 29, 2024

ప్రారంభ‌మైన ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాలు.. తొలి బోనం స‌మ‌ర్పించిన మంత్రి త‌ల‌సాని

తెలంగాణ‌లో బోనాల పండుగ క‌న్నుల పండువ‌గా జ‌రుగుతోంది. ఇవ్వాల (ఆదివారం) సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. రాజకీయాలకు అతీతకంగా అందరినీ బోనాల జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

మ‌హంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్ ఇవ్వాల‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. గోదవారి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపును క్షేత్రస్థాయిలో పరిశీస్తున్న ముఖ్యమంతి.. ఆ పర్యటన త‌ర్వాత ఏటూరునాగారం నుంచి హైదరాబాద్‌ చేరుకుంటారు. అనంతరం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement