Wednesday, May 1, 2024

ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా

ఐపీఎల్‌‌లో ఆదివారం సెలవు దినం కాబట్టి రెండు రసవత్తర మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ జట్టు అన్నింట్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాత్రి 7:30 గంటలకు చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఒకేరోజు రెండు క్రికెట్ మ్యాచ్‌లు ఉండటంతో క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement