Monday, April 29, 2024

Breaking: మంగ‌ళ‌వారం రంజాన్‌.. నిర్ణ‌యించిన రుయాత్‌ హిలాల్ క‌మిటీ

నెల రోజులుగా రోజా (ఉప‌వాసం) తో దీక్ష‌లు చేస్తున్న ముస్లింల‌కు గుడ్ న్యూస్ చెప్పింది రుయ‌త్ హిలాల్ క‌మిటీ.. దేశ‌వ్యాప్తంగా ఇవ్వాల (ఆదివారం) ఎక్క‌డా నెల‌వంక క‌నిపించ‌క‌పోవ‌డంతో మంగ‌ళ‌వారం రంజాన్ నిర్వ‌హించాల‌ని మ‌త పెద్ద‌లు నిర్ణ‌యించారు. దీనిపై రుయాత్‌ హిలాల్ క‌మిటీ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో పండుగ కోసం ముంద‌స్తు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు ముస్లింలు. తెలంగాణ‌లోని హైద‌రాబాద్ స‌హా.. ఇత‌ర జిల్లాల్లో పెద్ద ఎత్తున రంజాన్ పండుగ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ ప్రార్థనా మందిరాలను స్పెషల్​ అట్రాక్టివ్​గా ఉండేలా రంగులు వేసి, విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement