Monday, April 29, 2024

TRS: ప్లీన‌రీకి అటెండ్ కానీ హరీశ్.. అస‌లు రీజ‌న్ ఏంటో తెలుసా..

TRS: హైద‌రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి మంత్రి హ‌రీశ్‌రావు స‌హా.. ప‌లువురు కీల‌క నేత‌లు అటెండ్ కాలేదు. ఇప్పుడు ఆ పార్టీ వ‌ర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు స‌న్నిహితుడు, అల్లుడు అయిన హ‌రీశ్‌రావు ఎందుకు రాలేద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది..

అయితే.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌‌‌ను గెలుపించాలనే లక్ష్యంగా ప‌లువురు నేతలు ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు సహా ముగ్గురు మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్, కమలాపూర్‌లో విప్ బాల్క సుమన్, ఇల్లంతకుంటలో ఎమ్మెల్సీ పల్లా, వీణవంకలో పలువురు ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. వీరంతా ప్రచారంలో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్‌ ప్లీనరీకి హాజ‌రు కాలేద‌ని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement