Saturday, May 4, 2024

Telangana: ఉగాది ప‌చ్చ‌డి చేసిన ఎమ్మెల్సీ క‌విత‌…

తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది అంటే ష‌డ్రుచుల సమ్మేళనం. పండుగ నాడు  ఉగాది ప‌చ్చ‌డి చేయడం అనవాయితీ. ఉగాది వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత స్వ‌హ‌స్తాల‌తో ఉగాది ప‌చ్చ‌డి చేశారు. హైద‌రాబాద్‌లోని త‌న ఇంటిలో దేవుడి గదిలో కూర్చుని ఆమె ఉగాది ప‌చ్చ‌డిని త‌యారు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సేవించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది ప్రజలకు అన్ని రంగాల్లోనూ శుభాలు జరగాలని ఆకాంక్షించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ శ్రీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement