టైగర్3 చిత్రం నుంచి టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందంద. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ జంటగా నటించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు టీజర్ ను స్మలాన్ ఖాన్ తన ట్విట్టర్ లో పంచుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న ఈద్ సందర్భంగా ఈ మూవీని విడుదల చేయనున్నట్టు తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో నిర్మిస్తున్న 50వ చిత్రం ‘టైగర్ 3’కి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు మనీష్ శర్మ ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నారు. ఎక్తా టైగర్, టైగర్ జిందా హే మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన టీజర్ ఆసక్తి కరంగా ఉంది. నలుపు కలర్ షర్ట్ అండ్ ప్యాంట్లో ఉన్న కత్రినా కైఫ్తో కొన్ని ఫైట్ సీన్స్ ను చేస్తూ ఉండగా టీజర్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఆమెకు మరికొన్ని స్టంట్లను తెలియజేసేందుకు కొరియోగ్రాఫర్లు సూచనలు చేస్తూ కనిపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement