Thursday, April 25, 2024

Breaking: మూడు బస్సులు ఢీకొని… 37 మంది మృతి

మూడు బ‌స్సులు ఢీకొని 37మంది మృతిచెంద‌గా.. ప‌లువురికి గాయాలైన ఘ‌ట‌న విషాద ఘ‌ట‌న‌ నైజీరియాలో చోటుచేసుకుంది. ఈశాన్య నగరం మైదుగురి వెలుపల మూడు బస్సులు ఢీకొనడంతో 37 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఆ దేశ రోడ్డు భద్రతా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు వాణిజ్య బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ సమయంలోనే మరోబస్సు వేగంగా వచ్చి వీటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో37 మంది ప్రయాణికులు మరణించినట్లు బోర్నో రాష్ట్ర రోడ్డు భద్రత ఏజెన్సీ అధిపతి ఉటానే బోయి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement