Friday, May 3, 2024

Breaking: నన్ను చంపాలని చూశారు.. ఇదంతా రేవంత్​రెడ్డి పనే: మంత్రి మ‌ల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​లో నిన్న రాత్రి జరిగిన రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై చెప్పులు, రాళ్లతో దాడి జరిగిన ఘటన రాజకీయ మలుపు తిరుగుతోంది. ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి ఇవ్వాల ఉదయం (సోమవారం) స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను చంపాలని చూశారని మల్లారెడ్డి ఆరోపించారు. సింహగర్జన సభలో తనపై దొంగ చాటుగా రేవంత్ రెడ్డి దాడి చేయించారని అన్నారు. రెడ్డీల ముసుగులో రేవంత్ మనుషులు తనపై దాడి చేశారని మండిపడ్డారు. తనను హత మార్చేందుకు రేవంత్ చేసిన కుట్ర ఇది అన్నారు మంత్రి మల్లారెడ్డి. రెడ్డీలు దాడులు చేయరని.. తనపై రెడ్డీలెవరు దాడి చేయలేదని.. రేవంత్ రెడ్డి ఉసిగొల్పిన గుండాలే తనను చంపాలని చూశారని మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తూ రేవంత్ రెడ్డి తనను టార్చర్ చేశారని మల్లారెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి వల్ల తాను చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపారని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. బ్లాక్ మెయిల్ భరించడం తన వల్ల కావడం లేదన్నారు. రెడ్డి సింహగర్జన సభకు తానే పర్మిషన్ ఇప్పించానని తెలిపారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. తనపై దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రేవంత్ రెడ్డిపై కేసు పెడతానని, జైలుకు పంపిస్తానని మల్లారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి అక్రమ దందాలు బయటపెట్టినందుకే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. రేవంత్ కు వాల్యూ లేదని.. తనకు తానే ఆయన తోపుగా ఊహించుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి కుట్రలన్ని బయటి పెడతానని హెచ్చరించారు.

ఈ వీడియోల కోసం www.prabhanews.com ని క్లిక్​ చేసి, వీడియో ట్యాబ్​లో చూడొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement