Tuesday, May 21, 2024

BreakingL ఇగో ఇట్లుంట‌ది మ‌నతోని: ఐదొంద‌ల‌ని చెప్పి, మూడొంద‌లే ఇచ్చిన్రు.. మ‌హిళ‌ల లొల్లి లొల్లి!!

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడులో ఇవ్వాల (ఆదివారం) జ‌రుగుతున్న బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు పెద్ద ఎత్తున జ‌నాల‌ను త‌ర‌లించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు ఆ పార్టీ లీడ‌ర్లు. అయితే గ్రామాల నుంచి మ‌హిళ‌ల‌ను, ఇత‌ర కూలీల‌కు పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఆశ‌చూపి స‌భ‌కు త‌ర‌లించేలా ప్లాన్ చేసుకున్నారు. మ‌హిళ‌ల‌కు ఒక్కొక్క‌రికి ఐదొంద‌ల రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పి, చివ‌రికి మూడొంద‌లు ఇవ్వ‌డంతో లొల్లి స్టార్ట్ అయ్యింది. ‘‘ఐదొందలు ఇస్తమని చెప్పి మూడొందలే ఇస్తే ఎట్లా? మూడొంద‌ల‌కే వ‌స్త‌డా ఎవ‌డ‌న్నా, వానికేమన్న బుద్ధి ఉందా? అంటూ మ‌హిళ‌లు బ‌హిరంగంగానే తిట్ల దండ‌కం మొద‌లెట్టారు. ఇప్పుడు ఇట్లాంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ కావ‌డంతో ‘‘ఇగో.. ఇట్లుంట‌ది మనతో’’ అనుకుంటున్నారు మునుగోడు ప్ర‌జ‌లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement