Monday, April 29, 2024

తాళాలు పగలగొట్టి : ప్రశ్నా పత్రాల దొంగతనం

గణపురం, ప్రభ న్యూస్ : మండలంలోని చెల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ తాళం, బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న 9వ తరగతి ,పదవ తరగతికి చెందిన త్రైమాసిక పరీక్ష పేపర్లను దొంగిలించారని పాఠశాల ప్రిన్సిపాల్ జుమ్ము నాయక్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే పోలీస్ లు క్లూస్ టీమ్ తో ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మంగళవారం నుండి పాఠశాల విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు ప్రారంభం కాగా అదే రోజు రాత్రి ఈ ఘాతకానికి పాల్పడ్డారు. దాంతో దొంగలు ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement