Saturday, April 20, 2024

“ఆడ‌వాళ్లు మీకు జోహార్లు” థియేట్రికల్ ట్రైలర్ రేపే..

శర్వానంద్ చివరిగా విడుదలైన మహా సముద్రం అంత‌గా ఆక‌ట్టులేక పోయింది.. అయితే మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉన్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమ‌తో కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు శ‌ర్వానంద్. పుష్ప ది రైజ్ తో విజ‌యం అందుకున్న తర్వాత రష్మిక మందన్న నటిస్తోన్న చిత్రం ఇది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు తిరుమల కిషోర్ మెగాఫోన్ పట్టారు. కాగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను న రేపు (ఫిబ్రవరి 27) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, ఊర్వశి ముఖ్యమైన‌ పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎడిటర్ ఎ శ్రీకర్ ప్రసాద్ ఉండగా, సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement