Friday, May 3, 2024

నీటి కుంట‌లో నీరు తాగుతున్న పులి.. వాహ‌నాల‌ను ఆపేసిన అధికారులు

నీటి కుంట‌లో నీరు తాగుతున్న పులికి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని ఫారెస్టు అధికార‌లు వాహ‌నాల్ని ఆపేశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఉత్తరప్రదేశ్‌లోని కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా వెళుతున్న జాతీయ రహదారి పక్కన అడవి బెంగాల్ పులి నీరు త్రాగుతున్న వీడియోను పంచుకున్నారు. ఓ చిన్న నీటి కుంటలో అది నీరు తాగుతూ కనిపించింది. పులికి ఇబ్బంది కలగడకూడదని ఫారెస్టు అధికారులు వాహనం ఆపేయడం గమనార్హం. ఈ వీడియోకి ది రోడ్ స్టాపర్ అంటూ షేర్ చేశారు. వాస్తవానికి ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ఆకాష్ దీప్ బధవాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అతను ఇలా వ్రాశాడు, అభయారణ్యం బఫర్ ప్రాంతంలో రేంజ్ ఆఫీసర్ కతర్నియాఘాట్ ఈ రోజు ఉదయం క్లిక్ చేసార‌ని క్యాప్షన్ జత చేశారు. 5 గంటల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో ట్విటర్‌లో 40,000కి పైగా వీక్షణలను సేకరించింది. ఈ వీడియో చూసిన కొందరు ట్విటర్ యూజర్లు ఆశ్చర్యపోయారు. ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు, పులిని గౌరవించాల్సిన అవసరం ఉందని, అది నీరు తాగేవరకు వాహనం ఆపడం మంచిదని, హారన్ కొట్టకుండా ఆపడం మంచిదని కామెంట్ చేయడం గమనార్హం. మరికొందరు అయ్యో.. నీరు తాగడానికి చిన్న కుంటను ఎంచుకుందా అని కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement