Saturday, May 4, 2024

దేశంలో భారీగా క‌రోనా : ఒక్క‌రోజులోనే 22,775 కేసులు

దేశంలో రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. క‌రోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఒక‌వైపు క‌రోనా, మ‌రో వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి… మొన్న 16,764 కేసులు న‌మోదు కాగా, నిన్న 22,775 కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. నిన్న క‌రోనా నుంచి 8,949 మంది కోలుకున్నారు. అలాగే, నిన్న ఒక్క‌రోజులో 406 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో క‌రోనాకు 1,04,781 మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 98.32 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1,431కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,04,781 క‌రోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement