Friday, April 19, 2024

Breaking : మాలి మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రదాడి : 27 మంది సైనికులు మృతి

సెంట్రల్ మాలిలోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 27 మంది సైనికులు మరణించారు. మాలీలో మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడిచేసిన దాడిలో మ‌రో 33 మంది తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురి ఆచూకీ లభించడంలేదని ప్రభుత్వం తెలిపింది. సెంట్రల్‌ మాలీలోని గ్రామీణ ప్రాంతమైన మోడోరోలో ఉన్న మిలిటరీ క్యాంపుపై కారు బాంబులతో దాడిచేశారని వెల్లడించింది. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో 70 మంది దాకా ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నది. కాగా, ఇప్పటివరకు దాడికి బాధ్యతవహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement