Saturday, May 11, 2024

టెంపో ట్రావెలర్ లోయ‌లో ప‌డి… ఏడుగురు మృతి

టెంపో ట్రావెల‌ర్ లోయ‌లో ప‌డి ఏడుగురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో జరిగింది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులు సమీపంలోని ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను కులులోని దవాఖానకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement