Monday, April 29, 2024

తెలంగాణలో 577 మందికి కరోనా

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,11,226 కరోనా పరీక్షలు నిర్వహించగా, 577 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 645 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 79 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 66 కేసులు గుర్తించారు.ప్రస్తుతం 8,674 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,48,388 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,35,895 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనా తో మృతుల సంఖ్య 3,819కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement