Tuesday, April 30, 2024

సింహాచలం అప్పన్న స్వామిని దర్శించిన తెలంగాణ గవర్నర్

విశాఖపట్నంలోని సింహచల వరాహ లక్ష్మీ నరసింహా స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అందరూ బాగుండాలని, కరోనా అంతమవ్వాలి అని స్వామివారిని కోరుకున్నారు. వరాహ లక్ష్మి నరసింహ స్వామి చాలా శక్తి వంతమైన దేవుడు అని చెప్పారు. భక్తులకు ఏర్పాట్లు అన్నీ అద్భుతంగా ఉన్నాయన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వరాహ లక్ష్మీనృసింహ స్వామిని అందరూ ఆధ్యాత్మికంగా ఇష్టపడతారని గవర్నర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement