Saturday, May 4, 2024

నదీ జలాల వాటా కోసం తెలంగాణ కసరత్తు.. త్వరలో ఢిల్లీలో ప్రత్యేక అధికారి నియామకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొద్ది రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ అప్రమత్తమైంది. సమర్ధమైన వాదనలు వినిపించాలని, ప్రత్యేకంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా వ్యవహరించాలని భావిస్తోంది. అంతకు ముందే తో పెండింగ్‌ తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకోవడం, కృష్ణా నదీ జలాల్లో తెలంగాన రాష్ట్ర వాటాను ఇప్పుడున్న 299 టీఎంసీల నుంచి 575 టీఎంసీలకు పెంచుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఏపీ చేస్తున జలచౌర్యం తదితర అంశాలను ఢిల్లిలోని జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేలా ప్రత్యేక కన్సల్టెంట్‌ అధికారిని నియమిం చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

సాగునీటి పారుదల శాఖలోని అనుభవుజ్ఞుడైన రిటైర్డ్‌ జల నిపుణులను కన్సల్టెంట్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం ఢిల్లిdలో సాగునీటిపారుదల నిపుణుడు, రిటైర్డ్‌ సీనియర్‌ ఇరిగేషన్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించింది. ఆ అధికారి ద్వారా జల వివాదాలపై అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర జలశక్తిశాఖతో నేర్పుగా వ్యవహారాలు నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా త్వరలో ఢిల్లిdలో సాగునీటి పారుదల రంగ నిపుణుడిని కన్సల్టెంట్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియామకం కొద్ది రోజుల్లో జరగనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement