Thursday, April 25, 2024

Breaking: గుడిసెలు లేని తెలంగాణ బీజేపీ ల‌క్ష్యం.. అంద‌రికీ ఇండ్లు క‌ట్టిస్తాం: సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లులేని వాళ్లంటూ ఉండ‌కూడ‌ద‌ని, గుడిసెలు లేని తెలంగాణ‌ను నిర్మిస్తామ‌ని బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ అన్నారు. ప్ర‌ధాని ఆవాస్ యోజ‌న కింద ల‌క్ష‌లాది ఇండ్లు తెప్పించి అర్హులైన అంద‌రికీ ఇండ్లు క‌ట్టిస్తామ‌న్నారు. ఉచిత విద్యం, ఉచిత వైద్యం మా హామీ త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తాం. పంచ‌భూతాల సాక్షిగా చెబుతున్నా.. తెలంగాణ‌పై, గోల్కొండ కోట‌పై బీజేపీ జెండా ఎగ‌రేస్తాం అని బండి సంజ‌య్ అన్నారు. త‌మ ప్ర‌భుత్వం వ్యాట్ త‌గ్గించి, పెట్రోలు ధ‌ర‌లు కూడా త‌గ్గిస్తాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement