న్యూజిల్యాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా భారత్ ఇవ్వాల తొలి మ్యాచ్ ఆడుతోంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో మ్యాచ్ జరుగుతోంది. కాగా తొలి సెషన్లో న్యూజిలాండ్ జట్టు 176 పరుగులు చేసింది. ఆరు వికెట్లు కోల్పోయింది. కాగా, తరువాయి భారత్ జట్టు బ్యాటింగ్ చేయాల్సి ఉండగా.. 177 పరుగుల టార్గెట్ ఉంది. ఇక.. అర్షదీప్ సింగ్ 1, వాషింగ్టన్ సుందర్ 2, కుల్దీప్ యాదవ్ 1, శివం మావి 1 వికెట్ తీసుకున్నారు.
ఈ క్రమంలో భారత బౌలర్లు కివీస్ని నిలువరించారు. అర్ష్ దీప్ సింగ్ ఓవర్లో కీలకమైన మైఖేల్ బ్రేస్వెల్ (1) రనౌట్ అయ్యాడు. 18వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ కాన్వే (52) పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా లాంగాఫ్లో క్యాచ్ అందుకోవడంతో అతను పెవిలియన్ బాట పట్టాడు. కాన్వే 31 బంతుల్లో 50పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, ఒక సిక్స ర్ ఉన్నాయి.
కాగా, ఫిన్ అలెన్ (35), కాన్వే (52), మార్క్ చాప్మన్ (0), గ్లెన్ ఫిలిప్స్ (17), బ్రేస్వెల్ (1), శాంత్నర్ (7), డేరియల్ మిచ్చెల్ 59*, సోది 0*