Friday, May 17, 2024

టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. టీడీపీ వర్గాల్లో టెన్షన్.. టెన్షన్

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యేకు కరోనా సోకింది. టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు.. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం సొంత నియోజకవర్గానికి చేరుకున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వర్గీయులు వెల్లడించారు. తిరుపతి ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌తో కలిసి మంతెన రామరాజు పాల్గొన్నారు. దీంతో టీడీపీ వర్గాలకు కరోనా టెన్షన్ పట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement