Friday, May 10, 2024

టీచ‌ర్ల వేధింపులు – విద్యార్థి ఆత్మ‌హ‌త్య -బ‌స్సుల‌ను త‌గుల‌బెట్టిన నిర‌స‌న‌కారులు

ఓ విద్యార్థి టీచ‌ర్ల వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దాంతో విద్యార్థిని త‌ల్లిదండ్రులు..బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్కూల్ కు వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. ఈ నిర‌స‌న హింసాత్మ‌కంగా మారింది. స్కూల్ ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేసి ఉన్న బ‌స్సుల‌ను త‌గుల‌బెట్టారు. త‌మిళ‌నాడు రాష్ట్రం కళ్లకురిచి సమీపంలోని చిన్న సేలం వద్ద ఉన్న ప్రైవేట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే త‌న‌ను ఇద్దరు ఉపాధ్యాయులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నోట్‌ను రాసిపెట్టింది. వెంటనే ఆమెను హాస్పిట‌ల్ కు తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆమె అప్ప‌టికే మృతి చెందింద‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement