Friday, April 19, 2024

స్టాలిన్ కేబినెట్ లో తెలుగువారికి ప్రాధాన్యం… గాంధీ, నెహ్రూలకు చోటు!

తమిళనాడులో ఘన విజయం సాధించిన డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్… 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం. గతంలో సీఎంలుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, పళనిస్వామి, పన్నీర్ సెల్వం అందరూ తమ కేబినెట్లో తెలుగువారికి ప్రాతినిధ్యాన్ని కల్పించారు. స్టాలిన్ కూడా అదే ఒరవడిని కొనసాగించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. అందుకే ఆయా ప్రాంతాల్లో అన్ని పార్టీలు తెలుగువారికి టికెట్లు ఇస్తుంటాయి. తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల ద్వారా గెలుపొందారు.

అరుప్పుకొట్టై ఎమ్మెల్యే కేకేఎస్ రామచంద్రన్  కు కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. తిరువణ్ణామలై నియోజకవర్గం ఎమ్మెల్యే ఏ వేలు  పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. రాణిపేట నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆర్ గాంధీ  టెక్స్ టైల్ శాఖ, చెన్నై దురైముగం నియోజకవర్గం నుంచి గెలిచిన పీకే శేఖర్ బాబుకు దేవాదాయశాఖ దక్కింది. ఇక తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేఎన్ నెహ్రూకు మున్సిపల్ శాఖ మంత్రి దక్కించుకున్నారు. కాగా, ఒకప్పటి సోవియట్ యూనియన్ నేత అయిన స్టాలిన్.. మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ, దేశ తొలి ప్రధాని నెహ్రూ పేర్లు కలిగిన వ్యక్తులు ఒకే కేబినెట్ లో ఉండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement