Thursday, April 25, 2024

గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కండిషన్‌లను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తనకు బళ్లారి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని, అందుకు అనుగుణంగా తన బెయిల్ నిబంధనలను సడలించాలని గాలి జనార్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం.. గాలి జనార్దన్ రడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ బెయిల్ నిబంధనలు సడలించడం కుదరదని తేల్చిచెప్పింది. ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి కోర్టుకు వచ్చేందుకు అవకాశం ఇస్తూ పిటీషన్ వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించాలన్న గాలి తరపు న్యాయవాది విజ్ఞాపనను కూడా ధర్మాసనం తిరస్కరిస్తూ జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement