Monday, May 6, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల‌తో ప్రారంభ‌మ‌యిన స్టాక్ మార్కెట్లు..న‌ష్టాల‌తో ముగిశాయి. ప్ర‌ధాన షేర్ల‌లో అమ్మ‌కాలు వెల్లువెత్త‌డంతో మార్కెట్లు న‌ష్టాల బాట ప‌ట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 366 పాయింట్లు నష్టపోయి 55,102కి పడిపోయింది. నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 16,498కి దిగజారింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.34%), విప్రో (2.58%), టెక్ మహీంద్రా (2.43%), హెచ్సీఎల్ (2.08%), ఐటీసీ (1.90%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అల్ట్రాటెక్ సిమెంట్ (-6.47%), ఏసియన్ పెయింట్స్ (-5.20%), డాక్టర్ రెడ్డీస్ (-3.49%), మారుతి (-2.76%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.65%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement