Thursday, July 25, 2024

Mumbai : లాభాల్లో కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 1,200 పాయింట్లకుపై లాభాల్లో ఉండగా.. నిఫ్టీ 350 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 57,865.94 పాయింట్లు, నిఫ్టీ 17,198.75 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల పవనాలతో భారీ లాభాలను నమోదు చేశాయి. దాదాపు అన్నిరంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు 1633 షేర్లు పురోగమించగా.. 250 షేర్లు నష్టపోగా.. 65 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. బీఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇన్ఫోసిస్‌, రిలయ్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement