Friday, May 3, 2024

స్టాక్ మార్కెట్ కి భారీ లాభాలు ..

నిన్న భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు కూడా భారీ లాభాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల‌త‌లు ఉండ‌టం కూడా లాభాల‌ని తెచ్చిపెట్టింది. ఇక వీక్లీ ప్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ కాంట్రాక్ట్ ముగుస్తున్న నేప‌థ్యంలో మార్కెట్ల్ లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 777 పాయింట్లు లాభపడి 58,461కి చేరుకుంది. నిఫ్టీ 235 పాయింట్లు పెరిగి 17,401కి ఎగబాకింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.92%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.65%), సన్ ఫార్మా (3.11%), టాటా స్టీల్ (2.80%), టెక్ మహీంద్రా (2.60% )బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది.. ఐసీఐసీఐ బ్యాంక్ (-0.78%), యాక్సిస్ బ్యాంక్ (-0.55%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement