Monday, April 29, 2024

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ‘థ‌మ‌న్’ కి క‌రోనా

క‌రోనా మ‌హ‌మ్మారి టాలీవుడ్ ని కుదిపేస్తోంది. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే కరోనా బారిన ప‌డ్డారు. కాగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. గ‌త రెండు రోజుల నుంచి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని చెప్పారు. ఈ మేర‌కు తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌న్నారు థ‌మ‌న్. ఈ పరీక్షల్లో తనకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్ వెల్ల‌డించారు. ప్రస్తుతం తాను.. హోం ఐసోలేషన్‌ లో ఉన్నట్లు థమన్ చెప్పాడు. ఈ మధ్య కాలంలో…. తనను కలిసిన వారంతా.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశాడు . కాగా.. టాలీవుడ్‌ పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా భారీన పడ్డారు. ప్రిన్స్‌ మహేష్‌ బాబు, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, విశ్వక్‌ సేన్, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ లాంటి నటులకు కరోనా సోకింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement