Monday, April 29, 2024

ఇళ‌య‌రాజాకి హైకోర్టులో ఊర‌ట

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య‌రాజాకి మ‌ద్రాస్ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఎకో,అగి ఆడియో సంస్థ‌ల‌కు షాక్ ఇచ్చింది కోర్టు. తాను రూపొందించిన పాట‌ల‌ను సీడీ, క్యాసెట్ల రూపంలో విక్ర‌యించ‌డానికి ఈ రెండు సంస్థ‌ల‌తో ఇళ‌య‌రాజా ఒప్పందం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒప్పందకాలం ముగిసినా రెన్యువల్ చేయకుండానే, ఈ సంస్థలు తన పాటలను విక్రయిస్తున్నాయని 2017లో హైకోర్టును ఇళయరాజా ఆశ్రయించారు. ఆ సమయంలో ఆడియో సంస్థలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఇళయరాజా మరోసారి అప్పీలు చేశారు. ఈ పిటిషన్ ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంబ్ విచారించింది. ఒప్పంద కాలం పూర్తయిన తర్వాత కూడా ఇళయరాజా పాటలను బిజినెస్ చేయకూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తరుపరి విచారణను మార్చి 31వ తేదీకి వాయిదా వేసింది. తమ ఆదేశాలపై ఆడియో సంస్థలు పిటిషన్ వేసుకోవచ్చని వెల్ల‌డించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement