Friday, May 17, 2024

సోనియాగాంధీతో విపక్ష నేతలు ప్రత్యేక భేటీ

ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లు 2021ని రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1946లో సవరణను కోరింది. అదేవిధంగా సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సవరణ) బిల్లు 2021ని రాజ్యసభ ఆమోదించింది. నియామకం ప్రారంభ తేదీ నుంచి ఐదు ఏళ్లు పూర్తయ్యే వరకు ఒకేసారి ఒక సంవత్సరం వరకు పదవీ కాలాన్ని పొడగించడానికి బిల్లు అనుమతి ఇస్తుంది. వాకౌట్‌ తరువాత.. రాజ్యసభ సభ్యులందరూ.. సోనియా గాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు. నిరసన కార్యక్రమాల వ్యూహంపై చర్చించారు. ఈ భేటీలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శరద్‌ పవార్‌, డీఎంకే నేత టీఆర్‌ బాలు, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరీతో పాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement